News

ఆరోగ్యం బాగోలేదని ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య


ప.గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన భానుప్రీతి ఫస్టియర్‌ దొమ్మేటి భానుప్రీతి (16) ఇంటర్‌విద్యార్థిని సోమవారం కళాశాల హాస్టల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడే హాస్టల్‌లో ఉంటోంది. ఆరోగ్యం బాగోలేదని 20రోజుల క్రితం ఇంటికి వెళ్లిన ఆమె ఆదివారం రాత్రి హాస్టల్‌కు వచ్చింది. సోమవారం యూనిట్‌ టెస్ట్‌ ఉన్నా వెళ్లకుండా గదిలోనే ఉండిపోయింది. మద్యాహ్నం తోటి స్నేహితులతో బోజనం చేశాకా వాళ్లందరూ పరీక్షకు వెళ్లారు. సాయంత్రం గదికి తిరిగొచ్చిన విద్యార్థులు ఎంతకీ తలుపు తీయకపోవటంతో పగులగొట్టి చూడగా లోపల ఫ్యాన్‌కు ఉరేసుకుని భానుప్రీతి మృతిచెంది కన్పించింది. అనారోగ్యంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు హాస్టల్‌ నిర్వాహకులు, పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరకుని భోరున ఘొల్లుమన్నారు.